Back to Home
Watermark
బుధవారం, 09 సెప్టెంబర్, 2026 TIME : 11:17 AM

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్మనబోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.. అనంతరం దిష్టిబొమ్మ దహనం

Main Image

రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు

మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్మనబోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం.. అనంతరం దిష్టిబొమ్మ దహనం

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

బోయినపల్లి: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ నేత తాతా మధు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్మనబోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, అనంతరం తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Additional Image

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొన్మనబోయిన సువీన్ యాదవ్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ విమర్శలకు అవకాశం ఉన్నప్పటికీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు.

ముందుగా కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు. అనంతరం తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.

తదుపరి కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాతా మధు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ నాయకులు హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కాంగ్రెస్ నాయకులు సూచించారు. రాజ్యాంగబద్ధ పదవుల గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments