Back to Home
Watermark
శుక్రవారం, 11 సెప్టెంబర్, 2026 TIME : 05:20 PM

భక్తి పారవశ్యంలో భక్తులు.. ఘనంగా అంగీంపు కార్యక్రమం

Main Image

ముగిసిన సప్త భజన సప్తాహం

భక్తి పారవశ్యంలో భక్తులు.. ఘనంగా అంగీంపు కార్యక్రమం

టేక్మాల్, దన్నారం, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా తెలుగు దినపత్రిక):

దన్నారం గ్రామంలో గత మూడు రోజులుగా ఎంతో నిష్ఠతో, ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన సప్త భజన సప్తాహం గురువారం ఘనంగా ముగిసింది. భగవన్నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆధ్యాత్మిక పురోగతితో పాటు సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ భజన సప్తాహం భక్తుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.

అంగీంపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, దివ్య నామస్మరణలు, సంకీర్తనలు నిర్వహించారు. భజనా బృంద సభ్యులు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. భజనల ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కలుగుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఆధునిక జీవన విధానంలో పెరుగుతున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. సప్త భజనల ద్వారా భక్తుల్లో సానుకూల దృక్పథం, సేవా భావం, ఆధ్యాత్మిక చింతన పెంపొందుతాయని తెలిపారు.

కార్యక్రమం ముగింపులో వేద పఠనం, దివ్య ప్రసాద వితరణ, మహా మంగళహారతి నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ స్థానిక సేవా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ఆంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments