లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తా: కేసీఆర్
నీళ్ల కోసం త్వరలో పాదయాత్ర చేస్తా లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తా: కేసీఆర్ హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా రాష్ట్రంలో సాగునీటి సమస్యలు, ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రకటించారు. లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తానని ఆయన వెల్లడించారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్రంలో సాగునీటి అంశంపై పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలు, సాగునీటి హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం...