Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తా: కేసీఆర్

Author TELANGANA ADDA NEWS | 06 Sep 2026, 06:08 PM |
లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తా: కేసీఆర్

నీళ్ల కోసం త్వరలో పాదయాత్ర చేస్తా

లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తా: కేసీఆర్

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో సాగునీటి సమస్యలు, ప్రాజెక్టుల పరిస్థితిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రకటించారు. లక్ష మంది రైతులతో కలిసి కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను సందర్శిస్తానని ఆయన వెల్లడించారు.

బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడిన కేసీఆర్.. రాష్ట్రంలో సాగునీటి అంశంపై పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలు, సాగునీటి హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితిని రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి, నీటి సమస్యలపై ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

రైతుల సమస్యల పరిష్కారం, సాగునీటి హక్కుల సాధన కోసం బీఆర్ఎస్‌ఎల్పీ సమష్టిగా పనిచేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించినట్లు సమాచారం.