Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

శాసనమండలి నుండి తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి సస్పెన్షన్.. సెషన్ మొత్తానికి అనర్హత ప్రకటించిన మండలి ఛైర్మన్

Author Mohammad azeem | 08 Sep 2026, 06:17 PM |
శాసనమండలి నుండి తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి సస్పెన్షన్.. సెషన్ మొత్తానికి అనర్హత ప్రకటించిన మండలి ఛైర్మన్

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలను వెంటనే సస్పెండ్ చేయాలని మహేష్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
ఈ తీర్మానంపై మండలి ఛైర్మన్ మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రస్తుత సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ అధికారికంగా ప్రకటించారు. ఈ సస్పెన్షన్ ప్రకటన తర్వాత శాసనమండలి వాయిదా పడింది.