Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత పోలీసుల తీరుపై లాయర్ల ఆగ్రహం

Author Mohammad azeem | 08 Sep 2026, 06:23 PM |
నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత పోలీసుల తీరుపై లాయర్ల ఆగ్రహం

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
​నాంపల్లి కోర్టు ప్రాంగణంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీలను కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో నారాయణగూడ ఎస్సై వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.
​విధుల్లో భాగంగా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులను నాంపల్లి కోర్టును ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని ఎస్సై హుకుం జారీ చేశారు. మీడియాపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతోపాటు హేళనగా మాట్లాడటాన్ని అక్కడ ఉన్న లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మీడియా ప్రతినిధులకు మద్దతుగా లాయర్లు ఆందోళనకు దిగడంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి.