ఉగ్రవాదుల మృతికి సంతాపమా..?
30th May, 2025 11:14 AM
కొలంబియా ప్రభుత్వ వైఖరి పట్ల శశిథరూర్ అసహనం
Shashi Tharoor | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే, మరణించిన ఉగ్రవాదులపట్ల కొలంబియా (Colombia) ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశిథరూర్ (Shashi Tharoor) అసంతృప్తి వ్యక్తం చేశారు.